యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కథానుసారం… శర్వానంద్ ప్లే బాయ్, ఏజ్డ్ గ్యాంగ్ స్టర్.. ఇలా టు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన సింహ భాగం చిత్రీకరణ విదేశాలలో జరిగింది. అంతేకాదు… చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోందని సమాచారం.
శర్వానంద్ కి జోడిగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత చిత్రం ‘పడి పడి లేచే మనసు’ ఆశించని విజయం సాధించిన నేపథ్యంలో… ఈ సినిమాపై భారీ ఆశలనే పెట్టుకున్నాడు శర్వానంద్.
[subscribe]
[youtube_video videoid=oeOrk9Iq0dk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: