రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు ఒకే సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదైన విశేషం. అలాంటి… విశేషానికి చిరునామాగా నిలిచిన చిత్రం `తిరుగులేని మనిషి` కాగా… ఆ రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు మహానటుడు నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా నాటికి ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో దశాబ్దాలుగా కొనసాగుతుండగా… చిరంజీవి రైజింగ్ హీరోగా తన ప్రభావం చూపిస్తున్న రోజులవి. అలాంటి తరుణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ సినిమాలో ఎన్టీఆర్, చిరు… బావ – బావమరిది పాత్రల్లో నటించారు. ఫలితం సంగతి ఏమిటనేది పక్కన పెడితే… ఓ అరుదైన కలయికకి శాశ్వత జ్ఞాపకంలా మిగిలిపోయింది ఈ క్రేజీ ప్రాజెక్ట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యన్టీఆర్కి జోడీగా రతి నటించగా… చిరుకి జంటగా `ఫటాఫట్` జయలక్ష్మి నటించిన ఈ సినిమాకి కె.వి.మహదేవన్ స్వరాలు అందించగా… ప్రముఖ నిర్మాత కె.దేవీవరప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. 1981 ఏప్రిల్ 3న విడుదలైన `తిరుగులేని మనిషి`… నేటితో 38 వసంతాలను పూర్తిచేసుకుంది
[youtube_video videoid=tJcvr2KdTOU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: