భారతదేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి కథానాయికగా నిలిచిన ఘనత స్వర్గీయ జయలలితది. ప్రస్తుతం ఆమె జీవితం ఆధారంగా రెండు బయోపిక్ మూవీస్, ఒక వెబ్ సిరీస్ రూపొందుతున్నాయి. `ది ఐరన్ లేడీ` అనే పేరుతో రూపొందుతున్న బయోపిక్లో జయలలిత పాత్రలో స్టన్నింగ్ పెర్ఫార్మర్ నిత్యా మీనన్ నటిస్తుండగా… తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న `తలైవి` (తమిళ్ టైటిల్)లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తోంది. ఇక వెబ్ సిరీస్లో ఎవర్గ్రీన్ యాక్ట్రస్ రమ్యకృష్ణ … జయలలిత పాత్రలో దర్శనమివ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కంగనా నటిస్తున్న బయోపిక్ జూలై నుంచి పట్టాలెక్కనుందని టాక్. కాగా… ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మొదటి భాగం జయ బాల్యం, సినీ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వంటి అంశాలతో రూపొంది వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుండగా… రెండో భాగం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘట్టం నుండి ఆమె చివరి మజిలీ వరకు ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ రెండు భాగాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=xsTZWd1V_8M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: