యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సాహో’ కాగా… మరొకటి పిరియాడికల్ లవ్ స్టోరీ ‘జాన్’ (ప్రచారంలో ఉన్న పేరు). సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘సాహో’ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుండగా…’ జిల్’ రాధాకృష్ణ రూపొందిస్తున్న ‘జాన్’ వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ప్రభాస్ 20 గా తెరకెక్కుతున్న ‘జాన్’ కి సంబంధించిన రెండో షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఈ నేపథ్యంలో.. చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశాడు. అంతేకాదు… కలకాలం నిలచే ఇద్దరు ప్రేమికుల అమరమైన కథగా ప్రభాస్ 20 తెరకెక్కుతోందని ఆయన తెలిపాడు. అలాగే.. 2020లో ఈ చిత్రం తెరపైకి రాబోతోందని ట్వీట్ చేసాడు. మరి… అమర ప్రేమికుడు గా ప్రభాస్ ఏ మేరకు మురిపిస్తాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: