తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది అనాది నుంది వస్తున్న సంప్రదాయమే. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల కొడుకులు ఎంట్రీ ఇచ్చారు… వాళ్లు కూడా స్టార్ హీరోలయ్యారు.. సినీ పరిశ్రమను ఏలుతున్నారు. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈసారి దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీ నుండి కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఆ హీరో ఎవరో కాదు రాజమౌళి అన్న, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు సింహా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ తండ్రి వారసత్వాన్ని తీసుకుని ప్లే బ్యాక్ సింగర్ గా హిట్ సాంగ్స్ పాడుతూ రాణిస్తున్నాడు. త్వరలో మ్యూజిక్ కంపోజర్ గా కూడా పరిచయం కాబోతున్నాడు. సింహా కూడా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక ఇప్పుడు హీరో గా అరంగేట్రం చేయబోతున్నాడు.
రంగస్థలం తీసిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో.. నిషాంత్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో.. సింహాను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈ చిత్రానికి కాల భైరవ సంగీత దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్,టైటిల్ ను ఏపీ తెలంగాణ లో ఎలక్షన్స్ అయిపోయిన తరువాత రిలీజ్ చేస్తారంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రాావాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన చేసేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=ETIzb4zmcbQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: