కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘చిత్రలహరి’. ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ సినిమాతో తేజ్ కు హిట్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాడు. ఇక తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. పరుగు పరుగు అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి వరుస పరాజయాల తరువాత చిత్రలహరి సినిమా తో వస్తున్నాడు తేజ్. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[youtube_video videoid=YQ7R0tjbpcM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: