బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అటు తెలుగు పరిశ్రమతో పాటు.. తనకు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి ద బిగినింగ్.. బాహుబలి ద కంక్లూజన్ అంటూ రెండు పార్ట్ లుగా తీసిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. ఇక సినిమాకు గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ‘గోదావరి’ రాజమౌళికి.. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్-2019కు హాజరు కావాల్సిందిగా స్వాగతం పలికింది. మరి గతంలో ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు భారతదేశానికి చెందిన ప్రముఖులు కమల్ హాసన్, షారుక్ ఖాన్, పవన్ కళ్యాణ్ సహా మరెందరో ప్రముఖులను స్వాగతించగా.. ఇప్పుడు రాజమౌళిని ఆహ్వానించడం గొప్ప విషయమే.
బాహుబలి సినిమా విజయం వెనుక ఆయన శ్రమ ఎంత ఉందో మాకు తెలుసు.. ఆయన హార్డ్ వర్క్ ఇప్పటి యంగ్ జనరేషన్ కు స్ఫూర్తిగా నిలవాలి.. ఈ మొత్తం ప్రక్రియను మేం కేస్ స్టడీగా భావిస్తున్నాం. అందుకే విద్యార్థులు మరియు మాలాంటి యంగ్ఎంటర్ప్రెన్యూర్లను ఉద్దేశించి ప్రసంగించాలని హార్వర్డ్ కోరడాన్ని మేం గౌరవంగా భావిస్తున్నాం” అని ‘టీం’ గోదావరి స్పష్టం చేసింది. మొత్తానికి రాజమౌళికి ఈ గౌరవం దక్కడం హర్షించతగ్గ విషయమే.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: