సినిమా రిలీజ్ ముందే ఎన్నో వివాదాలు మూటగట్టుకున్న మణికర్ణిక… సినిమా రిలీజ్ అయిన తరువాత కూడా అవే వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి డైరెక్టర్ క్రిష్ వల్ల మరోసారి వివాదం తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రిష్ మణికర్ణిక గురించి మాట్లాడుతూ.. సినిమాలో 70 శాతం షూటింగ్ నేను చేసిందే ఉన్నది.. నేను బంగారం తీస్తే… కంగనా దాన్ని సిల్వర్ చేసిందంటూ ఇలా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక క్రిష్ వ్యాఖ్యలపై కంగనా సోదరి స్పందించడం.. ఆతరువాత పులువురు ఈ వివాదం పై స్పందించి కొంతమంది కంగనాకుమద్దతు తెలుపుతుండగా…కొంతమంది క్రిష్ కు మద్దతు తెలుపుతుండటంతో రోజు రోజుకి వివాదం ముదురుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వివాదంపై తాజాగా సినీ నటి తమన్నా స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన తమన్నాను మణికర్ణిక వివాదంపై అడుగగా… ‘నాకు క్రిష్ గురించి బాగా తెలుసు. ఆయనతో కలిసి పనిచేయకపోయినప్పటికీ ఇద్దరం ఒకే పరిశ్రమకు చెందినవాళ్లం. కంగన నాకో నటిగా మాత్రమే తెలుసు.. ఆమె నటించిన ఎన్నో సినిమాలు చూశాను. నటిగా కంగనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు… అయితే ఈ సినిమా విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది దురదృష్టకరం…అందరికీ ప్రతిభ ఉంటుంది. దానిని గౌరవించాలి. క్రిష్ చెప్పినట్లు ఇతర విషయాలను పక్కనపెట్టి సినిమాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి మిల్కీ బ్యూటీ మరోసారి ఎక్కడా దొరకకుండా చాలా డిప్లామాటిక్ గానే ఆన్సర్ ఇచ్చిందిగా..!
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: