మెగాహీరోలకు కలిసొచ్చిన సంగీత దర్శకులలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా… మెగా కాంపౌండ్ హీరోలకి మొదటిసారిగా సంగీతమందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో దేవిశ్రీ పనిచేసిన మొదటి సినిమా `శంకర్దాదా ఎం.బి.బి.ఎస్` (2004) వసూళ్ళ వర్షం కురిపించింది. అలాగే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో డీఎస్పీ తొలిసారిగా జట్టుకట్టిన `జల్సా` (2008) అప్పట్లో బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ రెండు చిత్రాలకంటే ముందు… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో చేసిన `ఆర్య` (2004) మ్యూజికల్గానే కాదు… థియేటర్లలోనూ ఓ ప్రభంజనం సృష్టించింది. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దేవిశ్రీ చేసిన తొలి చిత్రం `ఎవడు` (2014) కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ నేపథ్యంలో… మరో మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో `ఎఫ్ 2`కోసం తొలిసారిగా దేవిశ్రీ బాణీలు అందిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… బన్నీ, చరణ్తో దేవిశ్రీ ఫస్ట్ టైమ్ జట్టుకట్టిన చిత్రాలను `దిల్` రాజు నిర్మించగా… ఇప్పుడు వరుణ్తో మొదటిసారిగా దేవిశ్రీ జట్టుకట్టిన సినిమాని కూడా తనే నిర్మిస్తుండడం విశేషం. మరి… `ఆర్య`, `ఎవడు`లాగే `ఎఫ్ 2` కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. కాగా… `ఎఫ్ 2` సంక్రాంతి కానుకగా ఈ నెల 12న తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=INqcYxExJOc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: