సెలబ్రిటీలు అప్పుడుప్పుడు సోషల్ మీడియో నుండి దూరమవుతుంటారు. కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల.. కొంతమంది కావాలని బ్రేక్ తీసుకోవడానికి సోషల్ మీడియాలో డియాక్టివేటివ్ అవుతుంటారు. ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కె.జియఫ్ సిరీస్ తో సినిమాతో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనులో ఉన్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తన అకౌంట్స్ నుండి డియాక్టివేట్ అయ్యారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సలార్ సినిమానే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఫ్యాన్స్ సినిమా అప్ డేట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా అడుగడం కామన్ అయిపోయింది. సినిమా గురించి అప్డేట్లు అడుగుతూ ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ ను కూడా ఫ్యాన్స్ అడిగే అవకాశం లేకపోలేదు. అందుకే సినిమాపై పూర్తి శ్రద్ద పెట్టాలనే నేపథ్యంలోనే కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరమైనట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: