ఢిల్లీలోని లవ కుశ రామ్ లీలా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 5న విజయ దశమి వేడుకలు జరగనున్నాయి. అయితే ,సెప్టెంబర్ 26 నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ఈసారి అయోధ్యలోని రామ మందిరం రూపంలో నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఏటా ఒక్కో థీమ్ తో మండపాన్ని నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్బంగా రావణుడి దిష్టిబొమ్మను కాల్చి వేస్తారు. ఈ ఏడాది దసరా వేడుకల్లో రావణ దహన కార్యక్రమానికి ఆదిపురుష్ మూవీ లో శ్రీరాముడిగా నటించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథి గా పాల్గొనడం విశేషం. రావణుడి దిష్టిబొమ్మను ప్రభాస్ తన బాణంతో దహనం చేస్తారని లవకుశ రామ్ లీలా కమిటీ చీఫ్ అర్జున్ కుమార్ చెప్పారు. రావణుడితో పాటు కుంభ కర్ణుడు, మేఘనాథ్ల బొమ్మలను సైతం ప్రభాసే దహనం చేయనున్నట్లు ,ఈ ఏడాది దిష్టిబొమ్మలు 100 అడుగుల ఎత్తులో ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: