ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ , వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ సక్సెస్ పై సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam
Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳
— Adivi Sesh (@AdiviSesh) August 5, 2022
కళ్యాణ్ రామ్ “బింబిసార”, డుల్కర్ సల్మాన్ “సీతారామం” సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోవడం ఆనందంగా ఉందనీ , ఇది కదా కావాల్సింది అంటూ , కరోనా పాజిటివ్ తో ఐసోలేషన్ లో ఉన్నాననీ , తన కోసం రెండు సినిమాలు చూసి ఎంజాయ్ చేయండనీ అడివి శేష్ ట్వీట్ చేశారు. “మేజర్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్ ప్రస్తుతం “HIT 2 ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: