పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా “లైగర్ ” మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. “లైగర్ ” మూవీతో విజయ్ బాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” మూవీ లో నటిస్తున్న హీరో విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “జనగణమన” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.
ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో కంప్లీట్ చేసుకున్న “ఖుషి” మూవీ తాజా షెడ్యూల్ ను మేకర్స్ వైజాగ్లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో సమంత, విజయ్ దేవరకొండలపై ఓ రొమాంటిక్ సాంగ్తో పాటు కీలక సన్నివేశాలను దర్శకుడు శివ తెరకెక్కించనున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































