మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా సుమారు 365 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో సాంగ్స్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప: ది రైజ్” మూవీ కి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో అనూహ్య స్పందన లభించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్తో గానం చేసిన, సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్గా మారిపోయింది. విడుదలైన 20 రోజుల్లోనే అన్ని భాషలలో 100ప్లస్ మిలియన్ వ్యూస్ని సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దుబాయ్ లో జరిగిన ఐఫా వేడుకలలో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆ వేడుకలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. తన ఫేవరేట్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా అని చెప్పడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: