సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “క్షణం “మూవీ తో అడివి శేష్ హీరోగా పరిచయం అయ్యారు . “క్షణం “మూవీ కి స్క్రీన్ ప్లే అందించిన అడివి శేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు.”అమీ తుమీ “, “గూఢచారి “, “ఎవరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన “మేజర్ “ మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “మేజర్ “మూవీని ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. “మేజర్” హిట్ తో యంగ్ హీరో అడివి శేష్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది.ఈమూవీ తో అడివి శేష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.వరస విజయాలతో అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు.
హీరో అడివి శేష్ ప్రస్తుతం “HIT 2-సెకండ్ కేస్” , “గూఢచారి 2” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: