ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఎంతో మంది నటీనటులను, డైరెక్టర్లను, నిర్మాతలను కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు నెలకొకటి అయినా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో సీనియర్ డైరెక్టర్ ను టాలీవుడ్ కోల్పోయింది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రామకృష్ణారెడ్డి 1948 మార్చి 8న నెల్లూరు జిల్లాలోని గూడూరులో మొదట వ్యాపారం చేసిన ఆయన.. ఇండస్ట్రీలో ఉన్న తన సన్నిహితుల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1973లో శోభానాయుడు, ఫటాఫట్ జయలక్ష్మిలను పరిచయం చేస్తూ `అభిమానవంతులు` చిత్రాన్ని నిర్మించారు. ఈసినిమా మంచి విజయం దక్కించుకోవడంతో ఆతరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. తన కెరీర్ లో`అభిమానవంతులు`, `వైకుంఠపాళి`, `అల్లుడుగారు జిందాబాద్`, `మూడిళ్ల ముచ్చట`, `మాయగాడు`, `సీతాపతి`, అగ్ని కెరటాలు` వంటి చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా ఎదిగారు. మరోవైపు `అమ్మోరు తల్లి` సినిమాను తెలుగులో డబ్ చేశారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























