పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. మొదటి షో నుండి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈసినిమా ఇప్పుడు అన్ స్టాపబుల్ అన్నట్టు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అయిపోతుంది. అయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు. ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరగా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 153 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా.. కేఏ ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలిసి 14కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో 27 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 196 కోట్లను కొల్లగొట్టింది. ఇక రెండు వారాలు పూర్తయ్యే సరికి 200 కోట్లను ఈజీగా దాటేస్తుందని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సముద్రఖని, నదియా, నాగబాబు, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు. థమన్ సంగీతం.. మది సినిమాటోగ్రఫి అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: