కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ పరిశ్రమపై ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కరోనా బారిన పడ్డారు. ఒకరు కాదు ఇద్దురు కాదు కరోనా బారిన పడిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. ఈ వారం రోజుల గ్యాప్ లోనే చాలా మంది తమకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. ఇక ఈ కరోనా బారిన పడిన వారిలో మంచు లక్ష్మీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు మంచు మనోజ్, ఆ తర్వాత అదే ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. మంచు లక్ష్మీ స్వయంగా ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఇక తాజాగా మంచు లక్ష్మీ కరోనా నుండి కోలుకుంది. ఈవిషయాన్ని తన ఇన్ట్సా ద్వారా తెలిపింది. ఒక వీడియో ద్వారా హాయ్ ఎవ్రీ బడీ.. గుడ్ మార్నింగ్.. ఐయామ్ నెగెటివ్ .. అంటూ తాను కరోనా నుంచి కోలుకున్నట్టు ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియో ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ మొదటి సినిమాతోనే ఉత్తమ విలన్గా నంది అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత ‘దొంగల ముఠా’, ‘చందమామ కథలు’, ‘గుండెల్లో గోదారి’, ‘దొంగాట’, ‘లక్ష్మీబాంబ్’ ఇలా పలు సినిమాలలో నటించింది. పిట్టకథలు వెబ్సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా ‘మాన్స్టర్’ అనే చిత్రంలో కూడా మంచు లక్ష్మీ ఒక కీలక పాత్రలో నటించనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: