మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 80 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “పుష్ప: ది రైజ్” మూవీ ని వీక్షించిన అందాల జాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ది కూలెస్ట్ మేన్ ఇన్ ది వరల్డ్ అంటూ అల్లు అర్జున్ “పుష్ప” మాస్ గెటప్ ఫోటోను షేర్ చేసి మైండ్ బ్లోయింగ్ మూవీ అని కొనియాడారు.ప్రస్తుతం జాన్వీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























