మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తిరుపతి లో జరిగిన “పుష్ప: ది రైజ్” మూవీ సక్సెస్ మీట్ లో రష్మిక మాట్లాడుతూ .. అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఇరగదీశారనీ , ఈ సినిమాలో మీరు ఎంతో అద్భుతంగా నటించారనీ , స్క్రీన్ పై మీ ఎనర్జీ చూస్తుంటే మాటలు రావడం లేదనీ , కచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డుతో పాటు అన్ని అవార్డులు మీకు రావాలనే కోరుకుంటున్నాననీ , అలా రాకపోతే మాత్రం చాలా హర్ట్ అవుతాననీ , మీకు ఫ్యాన్ని మాత్రమే కాదు, అంతకు మించి అనీ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























