అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఇక ఈసినిమా కోసం అడివి శేష్ కూడా ఎంతో రీసెర్చ్ చేశాడు కూడా. దీనిలో భాగంగానే వారి ఫ్యామిలీని కలవడం కానీ.. ఉన్ని కృష్ణన్ గురించి తెలుసుకోవడం కానీ.. మేకోవర్ ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని అప్పుడే సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్స్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ ఘటనన జరిగి నిన్నటితో 13 ఏళ్లు అవతుంది. ఈసందర్భంగా అడివి శేష్ ముంబై వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను కలిసి వారితో పాటు ప్రత్యేక నివాళి అర్పించారు.
At the #mumbaipolice memorial for the #martyrs of 26/11#majorsandeepunnikrishnan pic.twitter.com/yVHo7J2o97
— Adivi Sesh (@AdiviSesh) November 26, 2021
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: