యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే కదా. అప్పట్లో బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి యాంకర్ గా చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రాంకు హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకంతో ఈ షో సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతో నిర్వహకులు ఉండగా.. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు ఎన్టీఆర్. తన వాక్చాతుర్యంతో షో కి మంచి టీఆర్పీ రేటింగ్ ను తెస్తూ.. సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సామాన్యులతో పాటు అప్పుడప్పుడు ఈషోకి సెలబ్రిటీలు వస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈషోకి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వచ్చారు. మొదటి ఎపిసోడ్ నే రామ్ చరణ్ తో ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ షోని కూడా త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఆటను చూసేందుకు కూడా అభిమానులతో పాటు బుల్లి తెర ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా వీరిద్దరి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఏప్రిల్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా తర్వాత కొరటాల శివతో తను చేయబోతున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: