శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నిశ్రింకళ ఫిల్మ్ బ్యానర్స్ పై రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన “నాట్యం “మూవీ 22 వ తేదీ రిలీజ్ అయ్యి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కమల్ కామరాజు , రోహిత్ బెహల్ , ఆదిత్య మీనన్ , భానుప్రియ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“నాట్యం ” మూవీని వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా “నాట్యం” సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన “నాట్యం” చక్కని చిత్రమనీ , భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు అనీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: