శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం‘. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ చేయగా ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ శర్వానంద్ ఎంట్రీ.. ‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్.. ‘‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా’’ అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఇద్దరూ పోటాపోటీగా కనిపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మహా’ యుద్ధం మొదలు 👊
Presenting the Riveting #MahaSamudramTrailer 🌊
▶️ https://t.co/HYQKTHECsm#MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic @SonyMusicSouth #MahaSamudramonOct14th 💥 pic.twitter.com/8cbIEWXopH
— Ajay Bhupathi (@DirAjayBhupathi) September 23, 2021
కాగా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: