జెంటిల్మెన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కదిర్ దర్శకత్వంలో వినీత్, అబ్బాస్, టబు ప్రధానపాత్రలలో నటించిన “కాదల్ దేశం ” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ప్రేమ దేశం ” మూవీ 1996 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. 25 సంవత్సరాల తరువాత “ప్రేమదేశం” సీక్వెల్ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దర్శకుడు కదిర్ మాట్లాడుతూ .. “కాదల్దేశం” తమిళ మూవీ ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశామనీ , ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే ఘనవిజయం సాధించిందనీ, ఆ కాలంలో సరికొత్త ట్రెండ్ను సృష్టించిందనీ , అలాంటి చిత్రాలు ఇపుడు రావడం లేదనీ , అనేక మంది “ప్రేమదేశం” వంటి చిత్రాన్ని నిర్మించాలని కోరడంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలన్న నిర్ణయానికి వచ్చాననీ , ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందనీ , యంగ్ టాలెంటెడ్ యువతీ యువకులతో పాటు సీనియర్ నటీనటులు, అప్కమింగ్ యాక్టర్స్తో ఈ సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాననీ , ప్రస్తుతం నిర్మాణ సంస్థతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతుందనీ , “ప్రేమ దేశం ” మూవీసీక్వెల్ ను తెలుగులో తెరకెక్కించి, తమిళంలోకి డబ్ చేస్తామనీ , అందుకే తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు నిర్మాత కోసం అన్వేషణ జరుగుతోందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: