వినాయక చవితి సందర్బంగా యంగ్ హీరో నితిన్ తన 31వ సినిమా ను ప్రకటించారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో నితిన్ కు జోడీగా లక్కీ హీరోయిన్ కృతిశెట్టి నటిస్తున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ లో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా చాలా స్పెషల్ కథతో రూపొందనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ “మాచర్ల నియోజకవర్గం” తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుంది. “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో సోషల్ మెసేజ్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని సమాచారం. భారీ అంచనాల నడుమ రూపొందనున్న ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో హీరోయిన్ కృతి శెట్టి ప్రత్యేక ఆకర్షణ కానున్నారు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: