యాంకర్ గా బిజీగా ఉన్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అనసూయ తన ఫొటో షూట్ ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ డ్రెస్ లలో అందం గా కనిపిస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్న అనసూయ ఇప్పుడు ఒక కొత్త డైలాగ్ చెబుతున్నారు .బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ లో “భానుమతి… ఒక్కటే పీస్” అంటూ సాయి పల్లవి డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా అనసూయ “నేనుపర్ ఫెక్ట్ కాదు ఎందుకంటే నేను ఒరిజినల్ పీస్ “అంటూ తన తాజా ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: