సురేష్ ప్రొడక్షన్స్ , గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీ “మిడ్ నైట్ రన్నర్స్ “కు తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి “శాకినీ -ఢాకినీ ” టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ కై రెజీనా , నివేద థామస్ తొలిసారి యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారు. తమ పాత్రలకై రెజీనా , నివేద కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ మూవీ ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇవే బ్యానర్స్ పై కొరియన్ రీమేక్ మూవీ గా రూపొందిన “ఓ బేబీ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ అప్పీల్ ఉన్న “ఓ బేబీ” మాతృక ‘మిస్గ్రానీ’ చిత్రం మాదిరిగానే, “మిడ్నైట్రన్నర్స్’”మూవీ కూడా గ్లోబల్ అప్పీల్ ఉన్న కథాంశం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే అంశాలు అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా..ఈ చిత్ర దర్శకుడు సుధీర్వర్మ తెలుగు ప్రేక్షకుల అభిరుచి, ఆకాంక్షలకు తగ్గట్లుగా కథలో మార్పులు, చేర్పులు చేసి ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. .“శాకినీ -ఢాకినీ ” మూవీ ని దసరా పండగకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























