శ్రీనివాస్ రెడ్డి ఓవైపు హాస్యనటుడిగా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు హీరోగా కూడా చేస్తున్నారు. ‘గీతాంజలి’ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలలో హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వం లో ”ముగ్గురు మొనగాళ్లు” అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి తో పాటుగా ఈ చిత్రంలో ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి – వెన్నెల రామారావు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ – ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈమూవీ విడుదలకు సిద్ధం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ముగ్గురు మొనగాళ్లు” మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.”ముగ్గురు మొనగాళ్లు” చిత్రాన్ని ఆగస్ట్ 6న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో ట్రిపుల్ ఫన్ కు రెడీగా ఉండండి అని చెప్తూ రిలీజ్ డేట్ తెలిసేలా ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా, దీక్షిత్ శెట్టి మూగవాడిగా, వెన్నెల రామారావు అంధుడిగా కనిపించనున్నారు. ఈ ముగ్గురూ ఓ క్రైమ్ కేసు విషయంలో పోలీసులకు సహాయం చేసి నిందితుడిని ఎలా పట్టించారు అనే కాన్సెప్ట్ తో “ముగ్గురు మొనగాళ్లు” మూవీ తెరకెక్కింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: