“ఛలో “, “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నడ చిత్ర పరిశ్రమ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఆ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే రష్మిక మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై వికాస్ బెహెల్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “మూవీ తెరకెక్కుతుంది. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న “గుడ్ బై “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: