నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్యామ్ సింగ రాయ్”మూవీ కై హైదరాబాద్ లో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో 6 కోట్ల వ్యయం తో ఒక భారీ సెట్ ను రూపొందించారు. ప్రస్తుతం ఆ సెట్ లోనే షూటింగ్ జరుగుతుంది . కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. చిత్ర పరిశ్రమలో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ మాత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. యూనిట్ లోని కొందరు ముఖ్య సభ్యులకు కరోనా సోకడంతో “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్ నిలిచిపోయిందని తాజా సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: