సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ , చిరంజీవి – కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ -పూజాహెగ్డే జంటలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. “ఆచార్య “మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది.బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా “సర్కారు వారి పాట “మూవీ తెరకెక్కుతుంది. దుబాయ్ లో షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజున హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. “సర్కారు వారి పాట ” మూవీ 2022 జనవరి లో రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ , అంజలి , సునీల్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న బ్లాక్ బస్టర్ “F 2″మూవీ సీక్వెల్ “F 3 ” మూవీ ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండడంతో పలు మూవీస్ షూటింగ్ నిలిచిపోయాయి. పలు మూవీస్ విడుదల వాయిదా పడ్డాయి.”ఆచార్య”, “సర్కారు వారి పాట” , “F 3” మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయనే వార్తలు వచ్చాయి. హీరో పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడం తో చిరంజీవి , రామ్ చరణ్ పర్యవేక్షిస్తుండడం “ఆచార్య “మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్ కు కరోనా సోకిన కారణం తో షూటింగ్ నిలిచిపోయిందనే రూమర్స్ వచ్చాయి. చిత్ర యూనిట్ లో కీలక వ్యక్తి అవన్నీ రూమర్స్ అనీ షూటింగ్ సజావుగా జరుగుతుందనీ చెప్పారు . చిత్ర యూనిట్ మెంబర్స్ కు కరోనా సోకడంతో “సర్కారు వారి పాట ” మూవీ షూటింగ్ నిలిచిపోయిందని వార్తలకు బ్రేక్ వేసి షూటింగ్ సజావుగా సాగుతోందని , మహేష్ బాబు , కీర్తి సురేష్ షూటింగ్ లో పాల్గొంటున్నారనీ యూనిట్ మెంబర్ తెలిపారు. “F 3” యూనిట్ మెంబర్స్ లో ఒక కీలక వ్యక్తి కి కరోనా సోకడం తో షూటింగ్ నిలిచిపోయిందనీ , ఆ వ్యక్తి ఐసోలేషన్ లో ఉన్నారనీ ఒక యూనిట్ మెంబర్ తెలిపారు. కరోనా కారణం గా చిత్ర పరిశ్రమ పలు విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే. తిరిగి సెకండ్ వేవ్ కారణం గా నష్టపోయే అవకాశం ఉంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























