పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ “సలార్ ” మూవీస్ చిత్రీకరణ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. దీపికా పడుకొనే కథానాయిక. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ తో ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు మూవీ షూటింగ్స్ , రిలీజ్ లు ఆగిపోయాయి. మహారాష్ట్ర లో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో “ఆదిపురుష్ “మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అందువలన జూలై లో ప్రారంభం కావాల్సిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ దసరా పండగ తరువాత ప్రారంభం కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: