శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. దీపావళికి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది అందరిలోనూ ఆసక్తిని పెంచిన లవ్ స్టోరీ యూనిట్ తాజాగా మరో అప్డేట్ను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇన్నిరోజులు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ను జరుపుకోగా షూట్ ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఈ మేరకు మేకర్స్ ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అన్ని పనులు త్వరగా పూర్తిచేసి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. అంతేకాదు ఫిదాలో సాయి పల్లవితో మ్యాజిక్ క్రియేట్ చేసాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి నాగ చైతన్య-సాయి పల్లవిల ‘ లవ్ స్టోరీ’ ఎలా ఉంటుందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: