బిగ్ బాస్ 4- 54వ రోజు.. నోయల్ బయటికి వెళ్లిపోవడంతో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చారని.. కాన్ఫెషన్ రూమ్ లో ఉన్నారని.. అరియానా కెప్టెన్ కావడంతో వెళ్లి తీసుకురావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనితో అందరూ షాకయ్యారు.. వచ్చేది ఎవరబ్బా అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అరియానా రెండు రోజులు క్రితం చేసిన రిక్వెస్ట్ కు ఇప్పుడు ఆ డాల్ ను పంపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆ తర్వాత అభి, మోనాల్ ఇద్దరు తమ మధ్య వచ్చిన క్లాషెస్ గురించి.. గతంలో ఏం జరిగింది అన్న విషయాలపై మాట్లాడుకున్నారు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా అఖిల్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. మరి చూస్తే అభి-మోనాల్ తమ ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకున్నట్టే కనిపిస్తుంది.
ఆతర్వాత బిగ్ బాస్ టాస్క్. వారి కోసం అబద్ధాల కోరు, బద్దకస్తులు, జీరో టాలెంట్, గజిబిజి, అహంకారుల జంట అనే బోర్డులు సిద్ధం చేసి పెట్టాడు బిగ్ బాస్. ఇక ఒక్కో జంటను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన బిగ్బాస్ మిగతా జంటల గురించి ఏమనుకుంటున్నారో చెప్పడంతోపాటు, వారికి ఏ బోర్డు సరిగ్గా సూటవుతుందో పేర్కొనాలని ఆదేశించాడు. మొదట కన్ఫెషన్ రూమ్లో అభి-హారికలను పిలిచాడు. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన అభి – హారిక మాస్టర్-లాస్య జోడీని గజిబిజి జంట బోర్డు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మెహబూబ్-సోహైల్ వెళ్లి అరియానా-అవినాష్ జంటను బద్ధకస్తుల బోర్డు ఇచ్చారు. మోనాల్ – అఖిల్ అబద్ధాల కోరులు అనే బోర్డు ను సోహైల్-మెహబూబ్ జంటకు.. అరియానా-అవినాష్.. “అహంకారుల జంట”గా అఖిల్-మోనాల్ను, అమ్మ రాజశేఖర్ “జోడీ జీరో టాలెంట్ జంట”గా అభిజిత్-హారికలను ఎంపిక చేశారు.
టాస్క్ అయిపోయిన తర్వాత మెడల్స్ పంపించి ఎవరు ఎవరికి ఈ టాగ్ లైన్ ఇచ్చారో చెప్పి మెడల్ మెడలో వేయమని చెప్పాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అందరు అలా చేశారు. ఆతర్వాత ఆ మెడల్స్లో ఉన్నది నిజం కాదని నిరూపించుకునేందుకు వివిధ టాస్క్లు ఇచ్చాడు. జీరో టాలెంట్ వచ్చిన జంట పిల్చినప్పుడల్లా వారు పర్ఫామెన్స్లు చేయాల్సి ఉండగా, గజిబిజి జంటను పిలిచినప్పుడు వారు స్విమ్మింగ్ పూల్లో దూకాల్సి ఉంటుంది. అబద్ధాల కోరుల జంటను పిలిచినప్పుడల్లా వారు ఇంటిసభ్యుల గురించి నిజాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇంటిసభ్యులు కోపం తెప్పించినప్పుడల్లా అహంకారుల జంట ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. బద్ధకస్తుల జంటను పిలిచినప్పుడు ఇతర కంటెస్టెంట్లు ఏ పని చెప్పినా చేయాలని బిగ్బాస్ చెప్పాడు. ఇక బిగ్ బాస్ చెప్పినప్పుడల్లా ఎవరి టాస్క్ వచ్చినప్పుడు వారు చేస్తూనే ఉన్నారు. ఇక్కడే అఖిల్ కు సోహైల్ కు మధ్య మాటా మాటా పెరిగినా ఆ తర్వాత ఇద్దరూ కూల్ అయ్యారు. అబద్దాల కోర్టులకు టాస్క్ రాగా.. టాస్క్లో భాగంగా మెహబూబ్ మాస్టర్ గురించి చెప్తూ, ఆయనకు కోపమెక్కువ అని, వ్యక్తిత్వాన్ని నిందిస్తారని, దాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూచించాడు. అరియానా-అవినాష్ ఇద్దరూ అంట్లు తోమారు. అహంకారుల జంట టాస్క్ లో భాగంగా మోనాల్ మీద నీళ్లు గుమ్మరించగా, అఖిల్ ప్యాంటులో ఐస్ గడ్డలు వేసి ఇద్దరినీ స్విమ్మింగ్ పూల్లోకి తోశారు. గుడ్లు పగలగొట్టి వారి మీద వేశారు. మెహబూబ్ మోనాల్ బెడ్డును చిందరవందర చేయగా సోహైల్ వెళ్లి సర్దేశాడు.
అనంతరం బిగ్బాస్ ఇంటిసభ్యులకు 55 రోజుల ప్రయాణాన్ని వీడియో వేసి చూపించాడు.వారి జర్నీని చూసుకుని కంటెస్టెంట్లు మరోసారి ఎమోషనల్ అయ్యారు. పాత జ్ఞాపకాలు గుర్తు రావడంతో అభిజిత్, మోనాల్, అఖిల్ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. అటు అరియానా మాత్రం ఒంటరినయ్యాననిపిస్తోందని ఏడుస్తుంటే మేమంతా ఉన్నామంటూ అవినాష్ ఓదార్చాడు.
మరి చూద్దాం రేపు ఎవరు సేఫ్ అవుతారు.. ఎవరూ ఇంటినుండి వెళతారు.. వంటి విషయాలు తెలియాలంటే ఇంకా ఒక్కరోజు ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: