యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది . ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో
“ఆదిపురుష్ “బాలీవుడ్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ , దీపికా పడుకునే జంట గా రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ కొనడం తో తన కల నెరవేరిందని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. హీరో ప్రభాస్ కథానాయకుడిగా నటించే అన్ని మూవీస్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























