“ఛలో “, గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, భీష్మ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు చర్మ సంరక్షణకై కొన్ని టిప్స్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొన్ని వస్తువులు పడకపోవడంతో ఎలర్జీ వస్తుందని , తప్పని సరిగా ఎలర్జీ టెస్ట్ చేయించుకోమని, జంక్ , ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉండమని , ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొమ్మని , డైలీ 2 లీటర్ల మంచి నీరు తాగమని , సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటకు వెళ్ళవద్దని , రోజులో ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయొద్దని , ఒకటి లేదా రెండు సార్లు చేయొచ్చని , కఠినమైన ఫేస్ వాష్ తో చర్మం పొడిగా మారుతుందని , మాయిశ్చరైజేషన్ తో చర్మం మృదువుగా మారి , కాంతులీనుతుందని , ఈ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుకొమ్మని రష్మిక చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: