పైన ఫొటోలో మహానటి సావిత్రి ఎత్తుకున్న అగ్ర హీరో ఎవరనే ఆలోచిస్తున్నారు కదా. అది తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వెలుగు నీడలు. 1961 లో వచ్చిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని కూడా అన్నపూర్ణ పిక్చర్స్ పైనే నిర్మించారు. జగ్గయ్య , ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి వెంకటరామయ్య, సూర్యకాంతం, గిరిజ, రాజసులోచన, పద్మనాభం, పేకేటి శివరామ్, ఇ.వి.సరోజ, ముఖ్యపాత్రలో నటించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. ఇక అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో చల్లని వెన్నెల సోనలు అనే పాట గుర్తుండివుంటుంది కదా. ఆ పాటలోనే సావిత్రమ్మ ఓ బాబును ఎత్తుకొని ఉంటుంది. ఆ బాబు ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున. ఈ సినిమాతో మొదటి సారి బాలనటుడిగా నాగార్జున వెండి తెరపై కనిపించాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జునకి కేవలం 8 నెలలేనట.
అలా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత విక్రమ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిచిత్రంతోనే మరపురాని విజయాన్ని అందుకుని ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ అగ్ర హీరో స్థాయికి ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదిగి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ కింగ్ అన్నా.. మన్మధుడు అన్నా నాగార్జుననే. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ ఫిట్ నెస్ ను మెయిన్ టైన్ చేస్తున్నాడు. ఇక గత ఏడాది మన్మధుడు సీక్వెల్ మన్మధుడు 2 సినిమాతో వచ్చాడు కానీ ఆ సినిమా అంత విజయాన్ని అందించలేకపోయింది.
ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనితో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ మాత్రం చెప్పలేం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: