లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, మధూ జంటగా రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ “రోజా ” తమిళ మూవీ 1992 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. తెలుగు , మలయాళ , హిందీ, మరాఠీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. 3 నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ అందుకున్న “రోజా ” మూవీ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు మణిరత్నం “రోజా ” మూవీ కి సీక్వెల్ కై స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించనున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దుల్కర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం భారీ బడ్జెట్, భారీ తారాగణం తో “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత “రోజా 2 ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: