సక్సెస్ ఫుల్ “వజ్రకాయ “కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ “నన్నుదోచుకుందువటే ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. ‘డిస్కో రాజా ” మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో గుర్తింపు పొంది టాలీవుడ్ లో బిజీగా మారారు. నభా నటేష్ ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన నభా నటేష్ మాట్లాడుతూ .. చాలా ఫ్రీ అయిపోయానని, టీవీ చూస్తూ, పెయింటింగ్స్ వేస్తూ టైమ్ పాస్ చేస్తున్నానని , చాలా బోర్ కొడుతోందని , సెట్స్ పైకి వెళ్ళడానికి ఆసక్తి తో ఎదురు చూస్తున్నానని, ఎప్పుడెప్పుడు షూటింగ్ లో పాల్గొందామా అని ఉందని , ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గ్రూప్ లో పెడుతుంటా నని , షూటింగ్స్ త్వరగా ప్రారంభం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. సాయి తేజ్, నభా నటేష్ జంటగా రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ షూటింగ్ 10 రోజులు బ్యాలెన్స్ ఉంది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: