మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న సంగతి తెలిసిందనే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనను అందరూ ప్రశంసించారు. కీర్తి సురేష్ ను జాతీయ ఉత్తమనటిగా నిలబెట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ అవార్డు తో పాటు.. ఫిలింఫేర్ అవార్డు.. ఇంకా పలు అవార్డులనే సొంతం చేసుకుంది. ఇక మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ ఒక్కసారిగా మీరిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దీపిక పదుకొనే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తాను చేసే పనులను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహానటి సినిమా చూసిందట ఈ భామ. అంతేకాదు ఈ సినిమా తనకు బాగా నచ్చడంతో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో `మహానటి` పోస్టర్ను షేర్ చేసిన దీపిక.. `వెంటనే ఈ సినిమాను చూడండి` అని కామెంట్ చేసింది. ఇక దీపిక పోస్ట్కు స్పందించిన `మహానటి` దర్శకుడు నాగ్అశ్విన్ `కూల్ నోటిఫికేషన్తో నిద్రలేచాను`ని కామెంట్ చేశాడు.
మరి ఇక్కడివరకు బాగానే ఉన్నా అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా నటించే అవకాశం ఉన్నట్టు అప్పుడే వార్తలు మొదలయ్యాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: