చరణ్ పై కన్నేసిన వంశీ పైడిపల్లి..!

Director Vamshi Paidipally To Join Hands With Ramcharan Once Again After Yevadu
Director Vamshi Paidipally To Join Hands With Ramcharan Once Again After Yevadu

మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆ సినిమా తర్వాత ఇంత వరకూ ఇంకేం సినిమాను ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే మహర్షి తీసిన మహేష్ తోనే మళ్ళీ వంశీ సినిమా ఉంటుందని..జోరుగా వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లోనే సినిమా అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఏమైందో తెలియదు కానీ పరుశురాం లైన్ లోకి వచ్చాడు. ప్రస్తుతం మహేష్ ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరుశురాం తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ వార్త కన్ఫామ్ అయిపోయింది. మే చివరిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా మహేష్ తో ఛాన్స్ లేకపోవడంతో ఇప్పుడు వంశీ రామ్ చరణ్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేస్తారో ఇంకా కన్ఫామ్ కాలేదు. అందువలన తన తదుపరి సినిమాను ఆయనతో సెట్ చేయాలని వంశీ పైడిపల్లి ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి వంశీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘ఎవడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 7 =