నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఉండగా ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం .. ఈ యుగంలో దానిని తెలుసుకోవడానికి సాగించే అన్వేషణగా ఈ కథ నడవనుందని తెలుస్తోంది ఆ టీజర్ ను చూస్తే.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కార్తికేయ సీక్వెల్ కాదంటున్నారు చిత్రయూనిట్. కార్తికేయకు ఈ సినిమాకు సంబంధం ఏం ఉండదని… ద్వారకా గుడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది…ఈ సినిమా స్టోరీ ఇంకా గ్రిప్పింగ్ గా ఉంటుందని…థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా వుంటాయని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.. త్వరలోనే షూట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: