సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవలే వైష్ణవ్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నీ కన్ను నీలి సముద్రం అంటూ సాగే మొదటి పాట మార్చి 2న సాయంత్రం గం.4.05ని.లకు విడుదల అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Our first song wave is ready to hit your hearts 💘
First single #NeeKannuNeeliSamudram from #Uppena will be on your playlists from March 2nd @ 4:05 PM.
A Rockstar @ThisIsDSP Musical 🎶#UppenaOnApril2nd 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty #BuchiBabuSana @adityamusic pic.twitter.com/BR5a3fTEjP
— Mythri Movie Makers (@MythriOfficial) February 28, 2020




కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మెగా హీరో అదృష్టం ఎలా ఉందొ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























