విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా ‘ఓ పిట్టకథ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే..మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే ఈ సినిమా నుండి ప్రీ-టీజర్, టీజర్, మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు. మార్చి 1న హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ చిత్రంలో, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























