మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ఆచార్య` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఒక పాత్రలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగానూ, మరో పాత్ర కోసం నక్సలైట్ గానూ దర్శనమిస్తారని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పోలవరం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చిరంజీవి తదితరులపై కథలో కీలకమైన పోరాట ఘట్టాలను షూట్ చేస్తున్నారని వినికిడి. కాగా, ఆగస్టు 14న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష నాయికగా నటిస్తోంది. మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























