తాము అభిమానించే హీరో ఇంక సినిమా చేయడని ఎక్కడో కాస్త నిరాశలో ఉన్న అభిమానులకు పవన్ డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి పింక్ రీమేక్ మొదలైపోయింది. నిన్నటి నుండి పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. అంతేకాదు ఈ షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నాడు. షూటింగ్ సెట్స్ లోని పవన్ ఫోటోకూడా ఒకటి లీక్ అయింది. ఆ ఫోటో చూస్తుంటే.. పింక్ చిత్రం కోసం తన లుక్ పెద్దగా మార్చినట్టు కనిపించట్లేదు పవన్. ఇకపోతే ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమా కూడా లైన్ లో పెట్టినట్టు కనిపిస్తుంది. క్రిష్ దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటించనున్నట్టు సమాచారం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో పవన్ కోసం క్రిష్ కథను రెడీ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ లుక్ టెస్ట్ పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లి ఆగష్ట్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరిఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మొత్తానికి పవన్ అభిమానులు… పవన్ కనీసం ఒక్క సినిమా చేసినా చాలు అనుకుంటుండగా.. మరి ఒకటి కాదు డబుల్ ధమాకా అంటే… ఫ్యాన్స్ కు పండగే కదా మరి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: