దీపావళికి టాలీవుడ్ ట్రీట్

Diwali Treat For Telugu Movie Lovers,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Telugu Movie Lovers,Diwali Festival Treat For Telugu Film Lovers

నిన్న దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ పెద్ద ట్రీటే ఇచ్చింది. పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు, ఫస్ట్ లుక్ లు, ట్రయిలర్ లు రిలీజ్ చేశారు. ఇక ఆ అప్ డేట్స్ ఏంటో ఒక లుక్కేద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ గోపాల్ వ‌ర్మ దర్శకత్వంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం దీపావళి నాడు బాంబ్ ను వేస్తున్నానని చెప్పినట్టే చేసాడు వర్మ. నిన్న ఉదయం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. ఇక ఈ ట్రయిలర్ కాస్త వివాదాస్పదంగానే ఉంది.

ఇక దీపావళి సందర్భంగా మంచు మనోజ్ కూడా తన కొత్త జర్నీకి శ్రీకారం చుట్టాడు. ఇన్ని రోజులు సినిమాలతో సందడి చేసిన మంచు మనోజ్ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ స్వయంగా ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. నా సొంత నిర్మాణ సంస్థ ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’నిర్మాణంలోనే నా తదుపరి చిత్రాలు వస్తాయి. అదేవిధంగా కొత్త టాలెంట్‌ కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. భవిష్యత్‌ లో మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే మంచి చిత్రాలను మీరు చూస్తారు. అని ట్వీట్ లో తెలిపాడు.

ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా తన కొత్త సినిమా గురించిన అప్ డేట్ ఇచ్చాడు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు తన కొత్త సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. మరి ఆ వివరాలు తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకూ ఆగాల్సిందే.

ఇక ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు కూడా దీపావళి సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ నిన్న ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ నవంబర్‌ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో పెద్ద సెట్ వేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ట్వీట్ లో తెలిపారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా రష్మిక మందన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నేనూ నా ఫ్యామిలీ నన్ను చూడటానికి వచ్చిన 101 నవ పెళ్లికొడుకుని ఎలా హ్యాండిల్ చేస్తామో అంటూ.. ఈ పోస్టర్ ను పోస్ట్ చేసింది.

రాహుల్ విజయ్ హీరో గా ‘కాలేజ్ కుమార్’ మూవీ తెరకెక్కుతుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.