లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో కీర్తి సురేష్ అద్భుతంగా పర్ ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొంది , ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకొన్న విషయం తెలిసిందే. మహానటి మూవీ తరువాత కీర్తి సురేష్ కు ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్స్ వెల్లువెత్తాయి. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్న కీర్తి సురేష్ మిస్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో నవీన్ చంద్ర, జగపతి బాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.థమన్ Sసంగీతం అందించారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ S కోనేరు నిర్మాణసారథ్యం లో నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో ఫిమేల్ సెంట్రిక్ మూవీ మిస్ ఇండియా లో కీర్తి సురేష్ నటిస్తున్నారు. మిస్ ఇండియా మూవీ లో డిఫరెంట్ లుక్స్ కై కీర్తి సురేష్ బరువు తగ్గి పలు లుక్ టెస్ట్స్ చేయించుకున్నట్టు సమాచారం. ఒక్కొక్క లుక్ కోసం 10టెస్ట్ లు చేశారని, మొత్తం మీద 50 టెస్ట్ లు చేయించుకున్నట్టు సమాచారం. మిస్ ఇండియా మూవీ 45 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ యూరోప్ లో జరిగింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. మిస్ ఇండియా మూవీ లో కీర్తి సురేష్ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారని, అద్భుతంగా నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























