ఇప్పటి కథానాయికలు కేవలం గ్లామర్ రోల్స్కే పరిమితం కావాలనుకోవడం లేదు. సరైన అవకాశం దొరికితే… డీ-గ్లామర్ రోల్స్లోనూ నటించేందుకు సిద్ధమంటున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే… ముగ్గురు టాలెంటెడ్ బ్యూటీస్ డీ-గ్లామర్ రోల్స్లో పలకరించబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే…. ఈ ముగ్గురు కూడా మూగ, చెవిటి పాత్రల్లోనే కనిపించనున్నారు. ఆ కథానాయికలు మరెవరో కాదు… శ్రియ, అనుష్క, పాయల్ రాజ్ పుత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ డైరెక్టర్ సుజన రూపొందిస్తున్న పేరు నిర్ణయించని చిత్రంలో శ్రియ మూగ, చెవిటి మహిళ పాత్రలో నటిస్తుండగా… `నిశ్శబ్దం`లో అనుష్క కూడా అదే తరహా పోషిస్తోంది. ఇక పాయల్ రాజ్పుత్ కూడా `డిస్కో రాజా`లో మూగ, చెవిటి అమ్మాయిగా దర్శనమివ్వనుంది. మరి… తక్కువ గ్యాప్లో రానున్న ఈ చిత్రాలు… ఆ యా కథానాయికలకు ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























